Listen to this article

.జనం న్యూస్ జూన్ 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలం రైతులు పంట మార్పిడి తోనే ఆధిక దిగుబడి సాధ్యమని వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ సాయికిరణ్ డాక్టర్ సురేష్ తెలిపారు మండలంలోని కొత్త గట్టు సింగారం గ్రామ లో రైతులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు రైతులతో మాట్లాడుతూ పంటల సాగు లో రసాయన ఎరువులు తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలని తెలియజేశారు రైతులు వినియోగించే ఎరువులలో 35% శాతం మాత్రమే మొక్కలు తీసుకుంటాయి మిగతా 65% శాతం ఎరువులు భూమి లో ఉండటం మూలంగా భూమి లో చౌడుబారుతుందని తెలిపారు విత్తనాలను ఎరువులను కొనుగోలు చేసే సమయంలో దుకాణదారుల నుండి రసీదులు తప్పనిసరి తీసుకోవాలని తెలిపారు పంటకాలం పూర్తి అయ్యేవరకు రసీదులను భద్రపరచుకోవాలని రైతులకు సూచించారు ఈ కార్యక్రమంలో సాయిచంద్ ఏవో గంగ జమున రైతులు పాల్గొన్నారు……