Listen to this article

జనం న్యూస్.మే31. సంగారెడ్డి జిల్లా. హత్నూర. నియోజకవర్గం ఇంచార్జ్. (అబ్దుల్ రహమాన్)

భూసమస్యల నుండి శాశ్వత పరిష్కారం కోసంతెలంగాణరాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం 2025 అమలులో భాగంగా జూన్ 3వ. తేదీ నుండి 20 తేదీ వరకు హత్నూర మండలంలోని ఆయా గ్రామాలలో నిర్వహించనున్న రెవిన్యూ అవగాహన సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని హత్నూర మండల తహసిల్దార్ పర్వీన్ షేక్ అన్నారు. శనివారంనాడు మండల కేంద్రమైన హత్నూర తాసిల్దార్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు మూడవ తేదీ నుంచి నిర్వహించనున్న రెవిన్యూ అవగాహన సదస్సులకు అధికారులు రెండు టీములుగా ఏర్పడి గ్రామాలకు వెళ్లి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు,భూసమస్యలేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రెవిన్యూ సదస్సులో దరఖాస్తుదారులు ఇచ్చే ప్రతి అప్లికేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి రికార్డు చేయడం జరుగుతుందన్నారు. కోర్టు కేసులో ఉన్న వాటి గురించి దరఖాస్తు మాత్రమే తీసుకుంటామని సాదా బైనమాల దరఖాస్తులు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. గ్రామస్తులు రైతులందరూ ఈ భూభారతి సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో.డిప్యూటీ తహసిల్దార్ దావూద్ అహ్మద్. ఆర్ఐ హరిబాబు.రెవెన్యూ కార్యాలయ సిబ్బంది. తదితరులు పాల్గొన్నారు.