

జనం న్యూస్. తర్లుపాడు మండలం. జూన్ 2
తర్లుపాడు మండలం సీతనాగుల వరం గ్రామం లో గల రేషన్ దుకాణాన్ని ఆదివారం ఉదయం మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి రిబ్బన్ కట్ చేసి పునః ప్రారంభించారు రేషన్ సరుకులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రతి నెల రేషన్ దుకాణం వద్ద 15 రోజులపాటు రెండు పూటల చౌకదుకాణాల ద్వారా రేషన్ ఇవ్వడం జరుగుతుందని రేషన్ దుకానాల్లో అక్రమాలను అరికట్టెందుకే ఇంటింటికి వాహనాలను నిలిపి వేసి ప్రతి పేద కుటుంబానికి రేషన్ సరుకులు అందెందుకు కూటమి ప్రభుత్వము పాటుపడుతుందని అన్నారు తర్లుపాడు మండలం లోని అన్ని గ్రామాల్లో రేషన్ దుకానాలు పునః ప్రారంభించారు ఈ కార్యక్రమం లో తహసీల్దార్ కెకె కిషోర్ కుమార్, టిడిపి మండలం నాయకులు మాజీ జడ్పిటీసి రావి బాషాపతి రెడ్డి, టిడిపి మండల అధ్యక్షులు ఉడుముల చిన్నపరెడ్డి, టిడిపి నాయకులు పుచ్చనూతల గోపినాధ్, బోగినేని చిరంజీవి,గౌతుకట్ల సుబ్బయ్య, ఈర్ల పెద్ద కాశయ్య, మేకల వెంకట్,కుందురు సత్యనారాయణ రెడ్డి, కోటపాటి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు
