

ఇల్లంతకుంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్ది కుమార్..
జనం న్యూస్, జూన్ 2 కుమార్ యాదవ్ జమ్మికుంట )
పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ మరియు హుజురాబాద్ నియోజకవర్గం ఒడితల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు ఇల్లందకుంట మండల కేంద్రంలో ఇల్లందకుంట మండల పార్టీ అధ్యక్షులు పెద్ది కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించి ఘనంగా ఆవిర్భావ వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పెద్ది కుమార్ మాట్లాడుతూ..తెలంగాణ ప్రజల ఎన్నో ఏళ్ల కల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ నేతృత్వంలో నిర్ణయం తీసుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని అలాగే తెలంగాణకు స్వాతంత్రం ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అని పెద్ది కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 సంవత్సరాలకు అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం అభివృద్ధి దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు.
ఏక కాలంలో రుణ మాఫీ, రైతు భరోసా, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు ప్రయాణం, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 500 లకే వంట గ్యాస్ వంటి అనేక పథకాలను ప్రవేశపెట్టి ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తున్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ ఎస్ యు ఐ నాయకులు,గ్రామ శాఖల అధ్యక్షులు, మహిళా విభాగం నాయకురాళ్ళు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
