Listen to this article

జనం న్యూస్ 03 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

డెంకాడ మండలం బెల్లాం గ్రామం దగ్గరలోగల భాష్యం లే-అవుట్లో కొంతమంది వ్యక్తులు గంజాయి
సేవిస్తున్నట్లుగా వచ్చిన సమాచారంతో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ ఆదేశాలతో డెంకాడ పోలీసు స్టేషను ఎస్ఐ ఎ.సన్యాసినాయుడు ఆధ్వర్యంలోని పోలీసు సిబ్బంది, యాంటీ గంజాయి టీం జూన్ 2న దాడులు నిర్వహించి, గంజాయి సేవిస్తూ, విక్రయాలకు పాల్పడుతున్న ఒక జువినల్ తో సహా ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. అరెస్టుకాబడిన నిందితుల వద్ద నుండి 1.330కిలోల గంజాయి, మూడు సెల్ ఫోన్లు, రూ.200/-ల నగదును డెంకాడ ఎస్ఐ ఎ.సన్యాసి నాయుడు సీజ్ చేసారని జిల్లా ఎస్పీ తెలిపారు. పట్టుబడిన నిందితుల్లో (ఎ-1) జామి మండలం అలమండ గ్రామానికి చెందిన దాసరి గాంధీ (24 సం.లు) అనేవ్యక్తి గంజాయిని విక్రయిస్తున్నట్లుగా విచారణలో వెల్లడయ్యిందన్నారు. అదే విధంగా (ఎ-2) డెంకాడ మండలం బెల్లాం గ్రామానికి చెందిన జుతిక శ్యామ్ (19 సం.లు) (ఎ-3) మాల్లాపురెడ్డి రాకేష్ (ఎ-4) దిబ్బగుడ్డి గ్రామానికి చెందిన మల్లాపురెడ్డి వేణుతో సహా (5) జ్యువినల్ గంజాయిని సేవిస్తున్నట్లుగా విచారణలో వెల్లడైందన్నారు. గంజాయి విక్రయాలు జరిపిన వ్యక్తితోసహా, గంజాయి సేవించిన మరో నలుగురు వ్యక్తులను అరెస్టు చేసామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.