

జనం న్యూస్ జూన్ 3 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
కూకట్ పల్లి లోని జనసేన పార్టీ కార్యాలయంలో తెలంగాణలో ప్రమాదవశాత్తు మరణించిన నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంకు చెందిన కేతావత్ హరి సింగ్ , మహబూబ్నగర్ జిల్లా గద్వాల్ నియోజకవర్గానికి చెందిన బొప్పల జమున, నల్గొండ జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గకు చెందిన కుర్ర సైదులు
జన సైనికుల కుటుంబాలకు జనసేన అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ , ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ,ఆర్కే సాగర్ చేతుల మీదుగా బాధిత కుటుంబానికి ఐదు లక్షల చొప్పున బీమా చెక్కులనును అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు మరణించిన జన సైనికుల కుటుంబాలకు ఆసరా ఉండాలన్న ఆలోచనతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకువచ్చిన ఈ బీమా సౌకర్యం ఎంతోమంది జనసేనకుల కుటుంబాలకు భరోసాను కల్పిస్తుంది అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వీర మహిళ విభాగం కావ్య మండపాక, యడమ రాజేష్ ,కొల్లా శంకర్ , సరి కొప్పుల నాగేశ్వరరావు, సాంబశివుడు , మహబూబ్ , శ్రీను ఇతర నియోజకవర్గ నాయకులు మరియు జన సైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.
