Listen to this article

జనం న్యూస్ జూన్ 4 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

కూకట్‌పల్లి నియోజకవర్గంలోని మూసాపేట్ గూడ్స్ రోడ్ లోని ఈనాడు ఆఫీస్ దగ్గర గల శ్రీ పోచమ్మ ఎల్లమ్మ దేవాలయ కమిటీ సభ్యులు జిల్ల జీత్ రావు,జిల్ల బాబురావు, జిల్ల వెంకటేష్, జిల్ల సంజీవ్, జిల్ల గోపాల్, జిల్ల మధు ల ఆహ్వానం మేరకు శ్రీ పోచమ్మ , శ్రీ ఎల్లమ్మ , శ్రీ బంగారు మైసమ్మ, శ్రీ ముత్యాలమ్మ , శ్రీ ఉప్పలమ్మ అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజలలో కూకట్‌పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ పాల్గొని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి జనసేన పార్టీ నాయకులు ఎన్ .నాగేంద్ర ,కొల్లా శంకర్ , పండుగ సూర్య , కలిగినిడి ప్రసాద్ , పోలె బోయిన శ్రీనివాస్ ,పులగం సుబ్బు తదితరులు పాల్గొన్నారు.