Listen to this article

జనం న్యూస్ జనవరి 22(నడిగూడెం):- అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యం గా తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని తహశీల్దార్ సరిత అన్నారు.బుధవారం
మండలంలోని రత్నవరం,నారాయణపురం, కేశవపురం, తెల్లబల్లి ,కరివిరాల రామచంద్రపురం గ్రామాలలో ప్రజా పాలన గ్రామసభలు నిర్వహించారు. రత్నవరం గ్రామంలో జరిగిన గ్రామసభలో ఆమె మాట్లాడుతూ అర్హుల జాబితాలలో పేర్లు రానివారు అధైర్య పడవద్దని గ్రామసభల ద్వారా దరఖాస్తు ఇవ్వాలని కోరారు.ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారుల నుంచి సంక్షేమ పథకాలకు దరఖాస్తులను స్వీకరించారు. ఆయా గ్రామాలలో జరిగిన గ్రామ సభలలో ఎంపీడీవో సయ్యద్ ఇమామ్, ఆర్ ఐ గోపాల కృష్ణ,ఎంపీఓ విజయలక్ష్మి, ఏవో దేవ ప్రసాద్, ఏపీఓ శ్రీనివాసరావు, ఏపీఎం రామలక్ష్మి, ఏఈఓ మౌనిక,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బూత్కూరి వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు,ఆయా గ్రామాల ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు కే. శ్రీను, సి ఎచ్ పృథ్వీ, యండి అన్వర్ పాష,
పి.లక్ష్మి ప్రవళిక,గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు…