Listen to this article

జనం న్యూస్4 జూన్ 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమార్ స్వామి రిపోర్టర్)

ఎల్కతుర్తి మండల పరిధిలోని జిలుగుల గ్రామానికి చెందిన వేముల శ్రీకాంత్ కి ముఖ్యమంత్రి సహాయనిధి కింద 60.000 వేల రూపాయల గల చెకును కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తౌటం నరేందర్ ఆధ్వర్యములో భాదితునికి చెక్ ను అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షులు మాట్లాడుతూ.వేముల శ్రీకాంత్ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆరోగ్యం బాగుకోసం ఈ సహాయనిధి చెక్కును అందించామని ఈసందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమములో మాజీ సర్పంచులు గూటం జోగిరెడ్డి, రావుల రమేష్, మాజీ ఉపసర్పంచులు తంగేళ్ల ప్రవీణ్ కుమార్,ముచ్చ బుచ్చిరెడ్డి, బిల్లా ప్రభాకర్, బిల్లా సమ్మిరెడ్డి, కుక్కల రాయ మల్లు, కుక్కల ఎర్రయ్య, ఆరెపల్లి ప్రభాకర్, తంగేళ్ల రంజిత్, తదితరులు పాల్గొన్నారు.