

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు మేజర్ న్యూస్: కోనరాచపల్లి అరుంధతి వాడ నందు వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామి వారి తృతీయ వార్షికోత్సవ సందర్భంగా ఈ నెల 7వ తేదీ శనివారం శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించడం జరుగుతుందని ఆలయ ధర్మకర్త మరియు కోనరాచపల్లి మాజీ సర్పంచ్ బాలిపోగు సుబ్బయ్య మరియు కమిటీ సభ్యులు తెలిపారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని, ఈ కార్యక్రమంనకు సహకరించిన దాతలు దేవగిరి సుబ్బ నరసయ్య వారి కుటుంబ సభ్యులు మరియు పుత్తా నాగేశ్వ రరావు వారి కుటుంబ సభ్యులు మరియు కోటపాటి సురేంద్ర బాబు కుటుంబ సభ్యులు మరియు కొండిశెట్టి పెంచలయ్య కుటుంబ సభ్యులు మరియు రేనంగి వెంకట నరసయ్య కుటుంబ సభ్యులు కలిసి భారీ స్థాయి లో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్ట నున్నారు. మధ్యాహ్నం నుండి వృషభరాసు చే బండ లాగుడు పోటీలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు . ఈ బండ లాగుడు పోటీలకు మొదటి బహుమతి రూపాయలు 50,000/- తెలుగు దేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడు చామర్తి జగన్ మోహన్ రాజు ,రెండవ బహుమతి రూపాయలు 40, 000/- గీతాంజలి విద్యా సంస్థల అధినేత సంభావు వెంకట రమణ, మూడవ బహుమతి రూపాయలు 30,000/- ఎస్. వి. రమణ కాంట్రాక్టర్ మరియు ఒంటిమిట్ట టిడిపి మండల అధ్యక్షుడు గజ్జల నరసింహా రెడ్డి లు , నాల్గవ బహుమతి రూపాయలు 20,000/- తుర్రా సుబ్బనాయుడు మరియు వారి కుమారుడు మహేష్ నాయుడు లు, ఐదవ బహుమతి రూపాయలు 10,000/- మెర్రం రెడ్డి నితీష్ రెడ్డి మరియు పాలగిరి వెంకట సుబ్బయ్య యాదవ్ లు, ఆరవ బహుమతి రూపాయలు 5000/- దాసరి యర్రయ్య లు విజేతలకు అందివ్వడం జరుగుతుందని కమిటీ వారి తెలిపారు. కనుక ఈ కార్యక్రమంలో పోటీదారులు పొల్గొన్నాలని విజయవంతం చేయాలని కోరారు.