Listen to this article

జనం న్యూస్ జాన్ 05(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)

యోగ వల్ల పిల్లల జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచుతుంది అని వైద్యాధికారి డాక్టర్ రవీందర్ అన్నారు.. బుధవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విద్యార్థులతో యోగ చేయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 27 నుండి జూన్ 21 వరకు కొనసాగే అంతర్జాతీయ యోగ దినోత్సవంలో భాగంగా కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించి ” యోగ ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్” కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.. యోగ చేయడం వల్ల శ్వాస, వ్యాయామాలు, పిల్లల శ్వాసకోస వ్యవస్థను బలోపేతం చేస్తాయని అన్నారు.. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి పుష్ప, యోగ టీచర్ చెవుల భవాని, ధనవీర, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొనారు….