

జనం న్యూస్ జూన్ 6, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం,
ఈనెల 14న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలను సద్వినియోగం చేసుకోవాలని పరిగి సిఐ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జాతీయ లోక్ అదాలతో క్రిమినల్ కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, ఈ పిటి కేసులు, ట్రాఫిక్ చాలన్లు,భూ తగదాలు, సివిల్ కేసులు, అన్ని రాజి చేసుకునే అవకాశం ఉందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని పరిగి సిఐ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.