

ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించిన ఎంఈఓ సత్యనారాయణ
జూన్ 6 జనం న్యూస్ వెంకటాపురం మండల ప్రతినిధిబట్ట శ్రీనివాసరావు
వెంకటాపురం మండలం పాత్రాపురం గ్రామపంచాయతీ పరిధిలో మంగవాయి గూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పండ రామారావు మాట్లాడుతూ ఈ సంవత్సరము ప్రతి విద్యార్థి పాఠశాలకు ఎల్లవేళలా రావాలని విద్యార్థులకు తెలిపారు. పాఠశాలను విద్యాపరంగా అభివృద్ధి పథంలో నడిపించాలని పోషకులకు తెలిపారు. ఈ బడిబాట కార్యక్రమం సందర్భంగా పాఠశాలలో విద్యార్థులచే ప్రతిజ్ఞ కార్యక్రమము మరియు గ్రామసభ నిర్వహించారు తర్వాత పోషకులచే గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులకు స్కూలు యూనిఫాం ఎంఈఓ సత్యనారాయణ చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి ఎంఈఓ సత్యనారాయణ ప్రధానోపాధ్యాయులు పండా రామారావు పోషకుల కమిటీ చైర్మన్ పాయం బాబు గ్రామపంచాయతీ కార్యదర్శి జనార్ధన్,విద్యార్థిని విద్యార్థులు పోషకులు తదితరులు పాల్గొన్నారు.
