

జనం న్యూస్, జూన్ 6 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)
సిద్దిపేట జిల్లా రాయపోలు మండలం ఎల్కoటి గ్రామంలో నాభి శిలా విగ్రహ ప్రతిష్టా మహోత్సవం నాటినుండి అంగరంగ వైభవంగా నిర్వహింస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ నేటి నుంచి కొనసాగుతున్న ఉత్సవాలలో భాగంగా గురువారం రోజున రోజున యంత్ర విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కన్నుల పండుగ నిర్వహించామని తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ మహోత్తర కార్యక్రమంలో పాల్గొని స్వామి అనుగ్రహం పొందారని, అలాగే భక్తులందరూ తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. రేపటి నుండి మూడు రోజుల వరకు గ్రామ దేవతలను కొలుచుకుంటామని అన్నారు. నాభిషిలా విగ్రహా ప్రతిష్టా మహోత్సవానికి సహకరించిన దాతలకు, గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, సకాలంలో వర్షాలు పడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, స్వామివారిని కోరడం జరుగుతుందని అన్నారు, ఈ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్కoటి గ్రామ యువకులు, ఆర్గనైజర్ టీం సభ్యులు, మహిళలు, చిన్నారులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.
