

జనం న్యూస్ జూన్ 06:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని గుమ్మిర్యాల
గ్రామంలోఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం రోజునా బడిబాట కార్యక్రమమును తహశీల్దార్ మల్లయ్య ప్రారంభించి పాఠశాల పాంఫ్లెట్ మరియు బ్రోచర్ విడుదల చేశారు . ఇట్టి కార్యక్రమము ఉద్దేశించి మాట్లాడుతూ బడిబాటలో విద్యార్థుల సంఖ్యను పెంచాలంటే ఉపాధ్యాయులుమరియు తల్లిదండ్రులు పాత్ర చాలా అవసరం అని అన్నారు. అదేవిధంగావిద్యార్థుల కు ఆశించిన స్థాయిలో విద్యా బోధనచేయడమే కాకుండా అన్ని రంగాల్లో ముందుండేకొరకు కృషి చేయాలని కోరారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, మండల విద్యాశాఖాధికారి బి.ఆనంద్ రావు మాట్లాడుతూఅన్ని ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఉండేలా సకల సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందని కనుక తల్లితండ్రులు తప్పకుండా మీ పిల్లను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక, ఉన్నత, అంగన్ వాడి పాఠశాలల ఉపాధ్యాయులు ,గ్రామ పంచాయతీ కార్యదర్శి చిలివేరి రామకృష్ణ గ్రామస్థులు మరియు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు
