

జనం న్యూస్,జూన్06,అచ్యుతాపురం:
అచ్యుతాపురం శాఖా గ్రంథాలయంలో 40 రోజులు పాటు నిర్వహించిన వేసవి విజ్ఞాన శిబిరం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా ముగింపు సభకు అధ్యక్షత వహించిన లైబ్రరీయన్ కోటేశ్వరరావు మాట్లాడుతూ ఈ విజ్ఞాన శిబిరంలో విద్యార్థులకు కథలు, కథనాలు, సృజనాత్మక కృత్యాలు, క్రాఫ్ట్, పాటలు, పద్యాలు వంటి వాటిలో రిసోర్స్ పర్సన్లు వచ్చి శిక్షణ ఇచ్చారన్నారు. ఈ విజ్ఞాన శిబిరం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, డ్రాయింగు, క్విజ్ పోటీల్లో విజేత లైన విద్యార్థులకు ఎంఈఓ దేవరాయలు చేతుల మీదుగా బహుమతులు పంపిణీ చేశారు.అనంతరం విద్యార్థులందరికీ స్వీట్లు అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి విజ్ఞాన శిక్షణా తరగతులు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో ఉన్న జ్ఞానాన్ని పెంచడానికి,వారిలో ఏకాగ్రత పెరగడానికి ఈ వేసవి విజ్ఞాన శిక్షణ తరగతులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు.ఈ కార్యక్రమంలో విశ్రాంతి ఎస్ఐ మల్లేశ్వర రావు,గ్రంధాలయ పాఠకులు,విద్యార్థులు పాల్గొన్నారు.