Listen to this article

భూ భారతీ చట్టం ద్వారా భూ యజమానులకు మేలు.

అర్హులందరికీ భూ పట్టాలు.

జనం న్యూస్,జూన్06,

జూలూరుపాడు: తెలంగాణ రాష్ట్రలో భూ భారతీ చట్టం అమలు చేసిన సందర్భంగా ప్రతి గ్రామ పంచాయతీలో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి భూ భారతీ చట్టం పై ప్రజలకు అవగాహన మరియు భూ సమస్యలను పరిష్కరించేందుకు దరఖాస్తులు తీసుకునే కార్యక్రమం చేపట్టారు ఈ కార్యమామంలో భాగంగా మండలంలోని పడమట నరసాపురం గ్రామ పంచాయతీలో నిర్వహించే భూ భారతీ రెవెన్యూ సదస్సులో వైరా నియోజకవర్గ శాసన సభ సభ్యులు మలోత్ రాందాస్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత టిఆర్ఎస్ ప్రభుత్వం ధరణి చట్టాన్ని అమలు చేసి తెలంగాణ రైతాంగానికి అనేక సమస్యలనుమిగిల్చింది,తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో భూభారత చట్టం ద్వారా ప్రతి రైతుకు సమస్యలు అనే లేకుండా పకడ్బందీగా భూ రికార్డును నమోదు చేయడంలో ఈ భూ భారతీ చట్టం తీసుకొచ్చామని ఈ చట్టాన్ని ప్రతి లబ్ధిదారుడు వినియోగించుకొని వారి భూ రికార్డును నమోదు చేసుకోవాలని తెలిపారు అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు అన్ని అమలయ్యే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు ముందు ముందు మరెన్నో పేదలకు,రైతాంగానికి,తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మంచి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు లేళ్ల వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మంగీలాల్ నాయక్,మండల తహసిల్దార్ శ్రీనివాసరావు,సిఐ ఇంద్రసేనా రెడ్డి,ఎంపీడీవో కరుణాకర్ రెడ్డి,ఎస్సై రవి,ఎంపీఓ తులసీరాం,పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ బద్దులాల్,ఎంఈఓ జంకిలాల్, పంచాయతీ హారికా మరియు ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.