

జనం న్యూస్ 07 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక :2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.13,444 కోట్లతో వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్ అంబేడ్కర్ తన ఛాంబర్లో నేడు విడుదల చేశారు. గత ఏడాది కన్నా 19.20% అదనంగా పెంచినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది రుణ ప్రణాళికలో వ్యవసాయానికి రూ.8,025 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. MSME కింద ముద్ర, స్టార్టప్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా రుణాల కోసం రూ.1,843 కోట్లను కేటాయించామన్నారు.