

జనం న్యూస్ జూన్ 09 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
ప్రతీ నిరుపేద కుటుంబానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి ఆదుకుంటుందని ఆర్టీఏ మెంబర్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లావుడ్య రమేష్, యువనేత పుదారీ హరీష్ అన్నారు.సోమవారం రెబ్బేన మండలంలోనీ తుంగేడ గ్రామానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయి.ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేసారు.లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ దశల వారీగా అందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామనారు.కార్యక్రమంలో యువ నాయకులు పుదారి.హరీష్ ,మాజీ సర్పంచ్ రవీందర్,తుంగేడ గ్రామ అధ్యక్షుడు డోoగ్రి తిరుపతి, మరియు సీనియర్ నాయకులు మల్లయ్య , మహేందర్ రెబ్బేన ప్రెసిడెంట్ దుర్గం.మహేష్ హౌసింగ్ ఎ ఇ, గ్రామ పంచాయతీ సెక్రటరీ గోపాల కృష్ణ , తుంగెడ గ్రామ ప్రజలు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు.పాల్గొన్నారు