Listen to this article

జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగరాజ్ గౌడ్

జనం న్యూస్ జూన్ 11 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా )

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన సామాజిక న్యాయం హామీనీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేయడం పట్ల జిల్లా కాంగ్రెస్ నాయకులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్, హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిసి,ఎస్సీ,ఎస్టీ కులాలకు సంబంధించి మంత్రివర్గ విస్తరణలో రాజ్యాధికారాన్ని ఇవ్వడం హర్షణీయమన్నారు. జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వారికి దక్కాలనే కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, సంకల్పంలో భాగంగానే ఎస్సీ, ఎస్టీ,బీసీ,లకు కేబినెట్ లో చోటు , టి పీ సీ సీలో పదవులు దక్కాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నేతృత్వంలో టీ పీ సీ సీ మహేష్ కుమార్ గౌడ్, సారథ్యంలో సాధ్యమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ కుల మతాలకతీతంగా అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. దళితులకు, బీసీలకు కేటాయించిన మంత్రి పదవులు, పార్టీ పదవులే కాంగ్రెస్ పార్టీ, ప్రజా ప్రభుత్వ పనితీరుకు ప్రజా పాలనకే నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాలకు సామాజిక న్యాయం సాధ్యమని బడుగు బలహీనవర్గాలకు న్యాయం చేకూర్చే విధంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రజా పాలనలో కులగణన, ఎస్సీ వర్గీకరణ చేయడమే కాకుండా వాటిని పదువుల పంపిణీలో అమలు చేస్తూ దేశానికే తెలంగాణ మార్గం చూపుతుందని దేశంలో కులగణన చేస్తే ఎస్సీ, బీసీలకు ఎలాంటి రాజకీయ,ఇతర ప్రాధాన్యాలు చేకూరుతాయనే విషయంలో తెలంగాణ రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. ఇలా చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డీకి, మంత్రి వర్గానికి, ఎస్సీ,ఎస్టీ,బీసీ కులాల సంక్షేమం కోసం ప్రభుత్వంలో తన వంతు పాత్ర పోషిస్తూ సలహాలు ఇస్తున్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ,కి పీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్ గౌడ్‌,కు ధన్యవాదాలు తెలిపుతున్నామన్నారు.