Listen to this article

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.

జనం న్యూస్ 11 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విజయనగరం జిల్లా పోలీసుశాఖలో హెూంగార్డుగా పని చేసి, ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన హెూంగార్డు
బి.వి.రమణమూర్తికి ‘చేయూత”ను అందించేందుకు హెూంగార్డు సిబ్బంది ప్రోగు చేసిన ఒక్క రోజు డ్యూటీ అలవెన్సు రూ.3,23,050/- ల చెక్ ను జిల్లాఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ జూన్ 10న జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేసారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ – పోలీసుశాఖలో పని చేస్తూ ప్రమాదవసాత్తు లేదా అనారోగ్యంతో మరణించిన లేదా ఉద్యోగ విరమణ చేసిన హోంగార్డు కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకొనేందుకు హెూం గార్డ్స్ స్వచ్చందంగా ముందుకు వచ్చి, ఒక్క రోజు డ్యూటీ అలవెన్సు మొత్తాన్ని ప్రోగు చేసి, వారి కుటుంబాలకు “చేయూత” గా అందజేయడం అభినందనీయమన్నారు. ఈ తరహా చర్యలు చేపట్టడం వలన పోలీసు ఉద్యోగుల్లో ఐకమత్యం పెరగడంతోపాటు, వారి కుటుంబాలకు అండగా ఉన్నామన్న భరోసా లభిస్తుందని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. ఈ కార్యక్రమంలో హెూంగార్డ్సు ఇన్చార్జ్ ఆర్ఐ ఆర్.రమేష్ కుమార్, ఆఫీసు సూపరింటెండెంట్ టి.రామకృష్ణ మరియు పోలీసు కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.