

జనం న్యూస్ జూన్ 11 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
కూకట్ పల్లి వివేకానంద నగర్ లోని అయ్యప్ప స్వామి ఆలయంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు నూతనంగా నిర్మించిన గోశాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ గోవు మన సంప్రదాయానికి, ఆధ్యాత్మికతకు, వ్యవసాయానికి ప్రాణాధారం. ఇటువంటి గోశాలలు సమాజానికి పెద్ద వరంగా నిలుస్తాయి. పౌరులందరూ గోవును సంరక్షించే దిశగా ముందుకు రావాలి,” “గోశాలలు మన పాఠశాలలవలె, మానవతా విలువలను పెంపొందించే కేంద్రాలుగా నిలుస్తాయి. గోవు సంరక్షణ మన ధర్మం, ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తుంది. ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రతి గ్రామంలో కూడా జరుగాలి” అని వారు తెలియజేశారు. గోపూజ, గోవుల అర్చన వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించి, గోశాల నిర్వాహకులను రాజేశ్వరరావు అభినందించి గోవులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా వాటిని సంరక్షించాలన్నారు.
