Listen to this article

జనం న్యూస్, జూన్ 12 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పిడిచెడ్ రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన బాలాజీ న్యూరో హాస్పిటల్ బుదవారం ఘనంగా ప్రారంభించారు, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి బాలాజీ న్యూరో హాస్పిటల్ ప్రారంభం కార్యక్రమంలో పాల్గొని యాజమాన్యానికి అభినందనలు తెలిపారు, ఈ సందర్భంగా బాలాజీ న్యూరో హాస్పిటల్ డాక్టర్లు మాట్లాడుతూ, గజ్వేల్ మరియు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో బాలాజీ హాస్పిటల్ ప్రారంభించడం జరిగిందని, అనుభవజ్ఞులైన డాక్టర్లతో నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగడం జరుగుతుందని అన్నారు, ఈ కార్యక్రమంలో డాక్టర్ వంశీకృష్ణ వర్ధన్ రెడ్డి, డాక్టర్ సాయి, లింగ కనక ప్రసాద్, యావగారి సంతోష్ రెడ్డి, కర్రే సాయిలు, గుర్రాల కృష్ణమూర్తి, లాబ్ రాజు, పాతూర్ నర్సింలు,హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.