

రామకోటి రామరాజు సహకారంతో పంపిణి చేసిన
వాసవి సేవా సమితి జాతీయ అధ్యక్షులు పూరి సురేష్ శెట్టి
జనం న్యూస్, జూన్ 12 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో జోగులాంబ గద్వాల జిల్లా లోని కృష్ణానది తీరాన బీచుపల్లి ఆంజనేయస్వామి సన్నిధిలో శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు, సహకారంతో భద్రాచల సీతారాముల కల్యాన ముత్యాల తలంబ్రాలు బుధవారం నాడు వాసవి సేవా సమితి జాతీయ అధ్యక్షులు పూరి సురేష్ శెట్టి ఆధ్వర్యంలో వందలాది భక్తులకు తలంబ్రాలను ఉచితంగా పంపిణి చేశారు. ఈ సందర్బంగా భక్తులు మాట్లాడుతూ మా గ్రామానికి మొదటి సారిగా భద్రాచల దేవస్థానం నుండి తలంబ్రాలు రావడం మా అదృష్టం అని భక్తులు కోనియాడారు. ఆలయ అర్చకులు మారుతి పాల్గొన్నారు.

