

జనం న్యూస్ జూన్ 12 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫతేనగర్ డివిజన్లోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ .. అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.. ముందుగా భరత్ నగర్ నాళా పనులు పరిశీలించి కాలనీవాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు… ఈ సందర్భంగా నాలా పనుల్లో జాప్యం లేకుండా ఇక్కడ కాలనీవాసులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్న స్థలంలోనే నాలా విస్తరణ పనులు చేపట్టాలని అవసరమైతే కుడి పక్కన ఉన్న స్థలాన్ని సేకరించి పనులు చేపట్టాలి కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టవద్దని అధికారులకు గట్టి సూచన చేశారు.. పనులు కూడా త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు… అనంతరం ఫతేనగర్ లోని ప్రధాన సమస్య అయిన ఫ్లై ఓవర్ వద్ద పాదయాత్ర నిర్వహిస్తూ స్థానికంగా ఉన్న ప్రజలను సమస్యలు అడుగుతూ ముందుకు సాగారు.. అలాగే నిరుపేదలు ఎక్కువగా ఉండటం కారణంగా వారికి టీ.డి.ఆర్ కాకుండా మార్కెట్ వ్యాల్యూకు అధికంగా నష్టపరిహారం అందించాలని కోరారు.. ఆనాడు బాలానగర్ ఫ్లైఓవర్ నిర్మాణంలో ఈ విధంగానే చేసామని గుర్తు చేశారు…అనంతరం ఫతేనగర్ వార్డ్ ఆఫీసు నందు అన్ని విభాగాల అధికారులు అసోసియేషన్ సభ్యులతో ఏర్పరచిన సమావేశంలో పాల్గొని వినతులు స్వీకరించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిధులు మంజూరైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్య ధోరణి తో ఫతేనగర్ ఫ్లైఓవర్ పనులు ముందుకు సాగడం లేదని ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడానికి ఎందుకు జాప్యం చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు.. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బాలనగర్ ఫ్లైఓవర్ ను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని.. అలాగే ముస్లిం, హిందూ స్మశానవాటికలు పనులు పెండింగ్లో ఉన్నవి పూర్తి చేయాలని.. ఎక్కడెక్కడ నాళాలు, రోడ్లు మరమ్మత్తులు ఉన్నాయో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు… ఈ సందర్భంగా ఫతేనగర్ లో నిర్మించిన ఎస్ టి పి ప్లాంట్ ద్వారా నాళాలో మురికి నీరు పారకుండా మూసీ నదిలోకి మంచినీరు పోతుందని.. ఎస్టిపి ప్లాంట్లు కూకట్పల్లి నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపు మూడు పూర్తి కావచ్చాయని ..ఆనాడు అప్పటి మంత్రిగా ఉన్న కేటీఆర్ చొరవతో ఈ పనులు పూర్తి చేసుకోగలిగామని.. ఇలా ప్రజలకు ఉపయోగపడే మౌలిక సదుపాయాలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా బిఆర్ఎస్ ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు సాగేవారని.. నేడు నిధులు మంజూరైన అభివృద్ధికి ఆమడ దూరంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తోందని.. ఫతేనగర్ ఫ్లైఓవర్ పనులు జాప్యం చేస్తే ప్రజలకండగా నిలబడడానికి ధర్నా చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్, అన్ని విభాగాల అధికారులు బి ఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు…
