Listen to this article

జనం న్యూస్ జూన్ 12 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

హెల్పింగ్ హార్ట్స్ సొసైటీ తుటే విజయ్ కుమార్ ఆధ్వర్యంలో డాక్టర్ సత్యనారాయణ యనబై వ జన్మదిన వేడుకలు అశోక చక్ర దివ్యాంగుల సంఘం లొ ఘనంగా జరిగాయి, ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన బషీర్బాగ్ సీసీస్ ఏసిపి కిరణ్ కుమార్ సమక్షంలో కేక్ కట్ చేయించి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యనారాయణ వృత్తిరీత్యా వైద్యులు అయినప్పటికీ వివిధ రకాల సంఘ సేవ కార్యక్రమాలలో విరివిగా పాల్గొంటారని తెలియజేశారు, ఇంత గొప్ప మహనీయుని జన్మదిన వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఆయన అన్నారు, విశిష్ట అతిథిగా పాల్గొన్న ఓయూ జేఏసీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దరువు అంజన్న మాట్లాడుతూ సత్యనారాయణ సార్ ని ఆయన చేస్తున్నా వైద్య సేవలను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం వైద్యరత్న అవార్డు ఇచ్చి అభినందించిందని తెలియజేశారు సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక ప్రాంతంలో విశ్వకర్మ కుటుంబంలో జన్మించిన సత్యనారాయణ పేదల డాక్టర్ గా పిలువబడతాడని గుర్తు చేశారు, అనంతరం సత్యనారాయణ దంపత చేతుల మీదుగా వికలాంగులు పది హేను మందికి నిత్యవసర సరుకులు ఇవ్వడం జరిగింది, వికలాంగుల సంఘం అధ్యక్షుడు ఏసుబాబు ఇలాంటి కార్యక్రమం చేయడం సంతోషమని కొనియాడారు, ఈ కార్యక్రమంలో పద్మజా హాస్పిటల్ డైరెక్టర్ మధురిమ, మదర్ థెరిస్సా పౌడర్ శ్రావణ్ కుమార్, హైకోర్టు లాయర్ సంజన, భాగ్యలక్ష్మి ఫౌండేషన్ అధ్యక్షుడు మాణిక్యాచారి, మాధవాచారి, కనుకచారి, రామాచారి, శివాజీ, కనుక చారి,మహేంద్ర ఆచార్యులు, భగవంతు చారి శ్రీనివాసచారి హనుమంత ఆచారి మనోహరాచారి, తదితరులు పాల్గొన్నారు,