Listen to this article

బీసీల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే.

ఓబీసీ జిల్లా అధ్యక్షుడు అల్లాడి నరసింహారావు.

జనం న్యూస్,జూన్12,

జూలూరుపాడు:కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జూలూరుపాడు మండలం,కాకర్ల గ్రామ నివాసి, భద్రాద్ర కొత్తగూడెం జిల్లా, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు అల్లాడి నరసింహారావు యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీలకు పెద్దపీట వేస్తుందని, రాష్ట్ర మంత్రివర్గంలో బీసీ,ఎస్సీ,ఎస్టీలకు న్యాయం చేస్తుందనీ అన్నారు. పిసిసి కార్యవర్గంలో బీసీలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చారని రాబోయే రోజులలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం టిక్కెట్లు ఇవ్వడం జరుగుతుందని,జిల్లాలో ముగ్గురు బీసీలు అయినటువంటి మోత్కూరు ధర్మారావు, నాగా సీతారాములు,నల్లపు దుర్గాప్రసాద్ కు రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నియామకం చేసిన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ తెలంగాణ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,తుమ్మల నాగేశ్వరరావు, డిసిసి అధ్యక్షులు పొదేం వీరయ్య,ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలకు, రాష్ట్ర ఓబిసి చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం పట్టణ ఓబీసీ అధ్యక్షులు అమడగాని జయప్రకాష్ ,ఓబీసీ జిల్లా కార్యదర్శి రంజిత్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.