

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్.
జనం న్యూస్ 13 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం జిల్లా ఆండ్ర పోలీసు స్టేషనులో 2023వ సంవత్సరంలో నమోదైన అత్యాచారంకు పాల్పడిన కేసులో నిందితుడు మెంటాడ మండలం, కుంటినవలస గ్రామానికి చెందిన మాదిరెడ్డి అప్పారావుకి విజయనగరం మహిళా కోర్టు కమ్ 5వ ఎడిజె కోర్టు జడ్జి శ్రీమతి ఎన్.పద్మావతి గారు 12సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ.2వేలు జరిమాన విధిస్తూ జూన్ 12న తీర్పు వెల్లడించినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. మెంటాడ మండలం కుంటినవలస గామానికి చెందిన నిందితుడు మాదిరెడ్డి అప్పారావు అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఒకామెను బలవంతంగా అత్యాచారంకు పాల్పడినట్లు ఇచ్చిన ఫిర్యాదుతో ఆండ్ర పోలీసు స్టేషనులో 2023సం||లో అప్పటి ఆండ్ర పోలీసు స్టేషన్ ఎస్.ఐ పి.సిద్దార్థ్ కేసు నమోదు చేయగా అప్పటి గజవతినగరం సర్కిల్ ఇన్స్పెక్టరు ఎల్.అప్పల నాయుడు దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించగా, తరువాత దర్యాప్తు చేపట్టిన ఇన్స్పెక్టరు ఎన్.వి.ప్రభాకర్ నిందితుడిపై న్యాయ స్థానంలో అభియోగ పత్రం దాఖలు చేసారన్నారు. న్యాయస్థానంలో నిందితుడు మాదిరెడ్డి అప్పారావు నేరంకు పాల్పడినట్లుగా సాక్ష్యాలు నిరూపితం కావడంతో విజయనగరం మహిళా కోర్టు కమ్ 5వ ఎ.డి.జె. కోర్టు న్యాయమూర్తి శ్రీమతి ఎన్. పద్మావతి 12సం.లు కఠిన కారాగార శిక్ష మరియు రూ.2 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారన్నారు. ఈ కేసులో నిందితుడిపై నేరం నిరూపణ అయ్యే విధంగా పోలీసువారి తరుపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటరు ఎన్.శకుంతల వాదనలు వినిపించగా, గజపతినగరం ఇన్స్పెక్టరు జి.ఎ.వి.రమణ, ఆండ్ర ఎస్సై కే.సీతారాం పర్యవేక్షణలో కోర్టు కానిస్టేబుల్
కె.సూర్యనారాయణ, సి.ఎం.ఎస్. కానిస్టేబుల్ సిహెచ్. సౌజన్య సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపర్చారన్నారు. ఈ కేసులో త్వరితగతిన నిందితుడికి శిక్షపడే విధంగావ్యవహరించిన దర్యాప్తు అధికారులు, ప్రాసిక్యూషన్ అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపిఎస్ అభినందించారు.