Listen to this article

“”భూ భారతి సదస్సు””

మండల కేంద్రంలోని కొత్తగట్టు సింగారం గ్రామంలో శుక్రవారం రోజున ఎమ్మార్వో సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో మాట్లాడుతూ అనేక రకాల భూ సమస్యలు పరిష్కారం చేస్తాం అని, కొత్త పట్టా పాసు బుక్కు, పట్టా పాస్ బుక్ లో ఏవైనా తప్పుగా పేర్లు నమోదు అయిన మరియు ఒకరి భూమి ఇంకొకరి మీద పడినచో పలు సమస్యల గురించి పూర్తిగా గ్రామస్తులకు తెలియజేయడం జరిగింది. గ్రామంలో పలు రకాల హెల్ప్ డిస్క్ లు పెట్టి రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సదస్సులో రెవెన్యూ అధికారులు,మరియు,గ్రామపంచాయతీ సిబ్బంది,డీలర్ అశోక్, గ్రామస్తులు, ఉన్నారు..ఎమ్మార్వో గారికి దరఖాస్తు ఇస్తున్న పెంబర్తి వినయ్