Listen to this article

జనం న్యూస్ – జూన్ 14- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-

ప్రపంచ రక్త దాతల దినోత్సవం పురస్కరించుకుని స్థానిక కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కమలా నెహ్రూ ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ హరికృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారికి ప్రాణదాతలుగా నిలవాలని, రక్తదానం చేయడం ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిండు ప్రాణాలను రక్షించడం లాంటిదని ఆయన అన్నారు,ఈ రక్తదాన శిబిరంలో 22 మంది యువకులు రక్తదానం చేశారని ఆయన తెలిపారు, ఈ కార్యక్రమంలో హాస్పిటల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ పృథ్వి, నర్సింగ్ సూపరిండెంట్ ఫలీన , పద్మావతి, రక్తనిల్వకేంద్రం సిబ్బంది వీరబాబు, రాజు, దుర్గయ్య, మంచా నాయక్ ,రవి, నర్సింగ్ సిబ్బంది సరిత, లీనా, ప్రియా, మధు నవనీత ,తదితరులు పాల్గొన్నారు.