

వర్షాకాలంలో వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి…..
జనం న్యూస్ 15జూన్, భీమారం మండల్ ప్రతినిధి కాసిపేట రవి
ప్రస్తుతం వాతావరణ మార్పులు ప్రతికూల పరిస్థితులు వలన దోమలు విస్తారమై ప్రజల్లో దోమ కాటు వలన అనేక భయంకరమైన రోగాలు వచ్చే అవకాశం ఉంది వర్షాకాల ప్రారంభ దశలో దోమల వలన వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి మైదాన గ్రామాల్లో క్షేత్రస్థాయి సిబ్బందితో అవగాహన కల్పించాలి ఈ సీజనల్ డెంగ్యూ మలేరియా తో పాటు అనేక భయంకరమైన రోగాలు వచ్చే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలి వివిధ గ్రామాల్లో దోమల నుండి రక్షించుకునే వివిధ మార్గాలను అనుసరించి పాటించినప్పుడు కొంత మేరకు దోమలను నిర్మూలించగలమని వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు ఇంటి పరిసరాల పరిశుభ్రత కూడా పాటించవలసిన అవసరం ఎంతగానో ఉండాలి ఆశ వర్కర్లు స్థానిక మహిళ ఆరోగ్య కార్యకర్తలు అవగాహన కలిపే విధంగా చర్యలు చేపట్టలి ఇంటి ముందు మురికి నీరు నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం ఆరోగ్య సిబ్బంది గ్రామాల్లో పర్యటించి ప్రజలకు అవగాహన ఏర్పాటు చేయాలి . వర్షాకాలం కారణంగా డెంగ్యూ మలేరియా దోమలు ఉత్పత్తి కాకుండా పరిసరాలు పరిశుభ్రత మరియు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. నీళ్లు మరిగించి చల్లార్చిన నీళ్లు తాగాలి వేడి వేడి ఆహార పదార్థాలు తీసుకోవాలిని వైద్యలు సూచనలు ఇవ్వకుంటే ఎలా అని ప్రజలు వాపోతున్నారు