Listen to this article

జనం న్యూస్ 15 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

అనంతపురం జిల్లాలో జూన్‌ 9 నుంచి 11 వరకు జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో విజయనగరం క్రీడాకారులు విజయకేతనం ఎగరవేశారని అసోసియేషన్‌ అధ్యక్షుడు గురాన అయ్యలు శనివారం తెలియజేశారు. ఓవరాల్‌ ఛాంపియన్‌ షిప్‌లో 3వ స్థానం కైవసం చేసుకున్నారన్నారు. క్రీడాకారులు 19 గోల్డ్‌ మెడల్స్‌, 6 సిల్వర్‌ మెడల్స్‌, 8 బ్రాంజ్‌ మెడల్స్‌ సాధించినట్లు చెప్పారు. పతకాలు సాంధించిన క్రీడాకారులను అభినందించారు.