Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జూన్ 16 రిపోర్టర్ సలికినీడి నాగరాజు

రాష్ట్ర ఓబిసి బిజెపి ఉపాధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు మాట్లాడుతూ మోడీ 3. o ఈ 11 సంవత్సరాల కాలంలో సుపరిపాలన అమృతకాలం సందర్భంగా బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని తద్వారా భారతీయ జనతా పార్టీని గ్రామ గ్రామాన బలోపేతం చేయాల్సిందిగా తెలియజేసినారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ 11 సంవత్సరాలు కాలంలో బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందించారని కుల మత ప్రాంత రహితంగా అభివృద్ధిని కొనసాగిస్తున్నారని ముఖ్యంగా మహిళలకు రైతులకు యువతకు మంచి జరిగే విధంగా అనేక సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారని తెలియజేశారు ప్రపంచ దేశాల్లో అతిపెద్ద నాలుగవ ఆర్థిక వ్యవస్థగా నరేంద్ర మోడీ హయాంలో భారతదేశం అత్యద్భుతమైన ప్రగతిని సాధించిందని ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త నాయకులు పై ఉందని వీటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు పట్టణ మాజీ అధ్యక్షులు అడుసుమల్లి వెంకటేశ్వరరావు పట్టణ ఓబిసి మోర్చా అధ్యక్షులు కుప్పం కళ్యాణదుర్గారావు రూరల్ మండల కన్వీనర్ పోతవరం సుభాని రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అన్నపరెడ్డి లక్ష్మణ్ ఆరో వార్డు మైనార్టీ యువ నాయకులు షేక్ సుభాని నలమాల పేరయ్య క్రియాశీల సభ్యులు జోలపురం రాయుడు ఆఫీస్ సెక్రటరీ గుమ్మ బాలకృష్ణ టి బాబురావు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు అనంతరం దేశవ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 5 వరకు నిర్వహించనున్న కార్యక్రమంలో భాగంగా అమ్మ పేరుతో మొక్క అనే కార్యక్రమంలో స్థానిక ఆర్టీసీ బస్టాండు పక్కన మొక్కలు నాటే కార్యక్రమాన్ని బిజెపి నాయకులు మరియు కార్యకర్తలు చేసినారు