Listen to this article

జనం న్యూస్ 19 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి విజయనగరం పైడితల్లమ్మ దేవస్థానం కార్యనిర్వహణ అధికారిణిగా కే.శిరీష బుధవారం కార్యాలయ ఆవరణలో బాధ్యతలు చేపట్టారు.
ముందుగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి పూర్తిస్థాయిలో కృషి చేస్తామని పేర్కొన్నారు.