

జనం న్యూస్ జూన్ 30 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
భారతీయ జనతాపార్టీ రాష్ట్ర సంస్థాగత ఎన్నికలు జులై1న అనగా రేపు మంగళవారం జరగనున్నాయి అయితే ఆఎన్నికలలో ముమ్మిడివరం మండలానికి చెందిన ఇద్దరు నాయకులకు ఓట్లు దక్కడం విశేషం. చాలా సంవత్సరాలుగా పార్టీ లోసేవాలందిస్తూ ముమ్మిడివరం రూరల్ మండల మాజిఅధ్యక్షులు అయినటువంటి పొత్తూరి వి వి యస్ యన్ మూర్తిరాజు,ఎస్సీ మోర్చా భీమవరపు వి సూర్యారాజు లకు ఓటు హక్కు దక్కింది.దీంతో రేపుజరగబోయే ఎన్నికలో విజయవాడ నందు పాల్గొంటారు.
