Listen to this article

హక్కుల పరిరక్షణ కోసం పాటుపడాలి

టీయూడబ్ల్యూజే (ఐజేయూ ) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్.

జనం న్యూస్ 7జూలై కొమురం భీం

ఆసిఫాబాద్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్. కె ఏలియా. జర్నలిస్టులు ఐక్యంగా ఉండి హక్కుల సాధన కోసం ఉద్యమించాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం ( టీయూడబ్ల్యూజే – ఐజేయూ ) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఏ రోజ్ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఆసిఫాబాద్ ఎలక్ట్రానిక్ మీడియా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే (ఐజేయూ ) జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ మాట్లాడుతూ జర్నలిస్టులు అందరూ ఒక కుటుంబ సభ్యులేనని, ఎలాంటి విభేదాలు లేకుండా అందర్నీ కలుపుకొని పోవాలని , ఐక్యతతో ముందుకు సాగాలని నూతన కార్యవర్గాన్ని సూచించారు. టీయూడబ్ల్యూజే ( ఐజేయు) జర్నలిస్టుల సంక్షేమం కొరకు పాటుపడుతుందని తెలిపారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ కోసం పాటుపడాలని నూతన కార్యవర్గాన్ని సూచించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఎలక్ట్రానిక్ మీడియా కార్యవర్గాన్ని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ప్రింట్ మీడియా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఎస్ వేణుగోపాల్ , వారణాసి శ్రీనివాస్ , జిల్లా స్టాఫ్ రిపోర్టర్ లు హనమయ్య , రామ్మోహన్ , చిప్ప సురేష్ మాట్లాడుతూ ఐక్యంగా ఉండి జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కోసం పాటుపడాలని సూచించారు. కలిసికట్టుగా ముందుకు సాగుతూనే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని శాలువతో ఘనంగా సన్మానించారు. నూతనంగా ఎన్నికైన ఎలక్ట్రానిక్ మీడియా కార్యవర్గానికి సన్మానం ఆసిఫాబాద్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడు కొండపల్లి సాయి కుమార్ , ఉపాధ్యక్షులు వోరగంటి సంతోష్, ప్రధాన కార్యదర్శిగా అనిశెట్టి సదాశివ్, సంయుక్త కార్యదర్శిగా శివ,కోశాధికారిగా మహాత్మ భీం రావు, ప్రచార కార్యదర్శిగా విజయ్ కుమార్,గౌరవ అధ్యక్షులుగా రాజ్ కుమార్,గౌరవ సలహాదారులుగా సహరె రాజు,వెంకేశ్వర్లు,సురేష్,రమేష్ లల ఎన్నికైన సందర్భంగా వీరికి శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అక్రిడేషన్ కమిటీ మెంబర్ ప్రకాష్ గౌడ్ , ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి సాయి , సదాశివ్ , జర్నలిస్టు సంఘ నాయకులు మేకల శ్రీను , రమేష్ సోలంకి , ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు వెంకటేశ్వర్లు , సహారే రాజు, దాసరి సురేష్, బిక్కజి , ఖలీల్, ఇర్ఫాన్ , రమేష్ , మోయిన్ , అవినాష్ , శ్రీను , రవి , మినేష్ , ముబాసిర్ , శ్రీకాంత్ , వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.