Listen to this article

జనం న్యూస్ జులై 07 ఆసిఫాబాద్ జిల్లా బ్యూర

ఆసిఫాబాద్ మండల కేంద్రం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం ఆసిఫాబాద్ షీ టీమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీం సిబ్బంది మాట్లాడుతూ…
విద్యార్థినులకు ఈవ్ టీజింగ్, సోషల్ మీడియా వేధింపులు, మహిళల అక్రమ రవాణా, బాల్యవివాహాలు, బాల కార్మికులు , గుడ్ టచ్, బ్యాడ్ టచ్, సైబర్ క్రైమ్స్, మాదకద్రవ్యాల వంటి వాటిపై షీ టీం సభ్యులు స్వప్న,రజని, దినేష్ లు వివరించారు. మహిళలు,విద్యార్థులు సామాజిక మాధ్యమాలైన ఫేస్బుక్,వాట్సప్,ఇంస్టాగ్రామ్ వినియోగంలో జాగ్రత్తలు వహించాలని ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసే సమయంలో వ్యక్తిగత భద్రతకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎవరైనా మహిళలు విద్యార్థులు పిల్లలు వేధింపులకు గురి అయినట్లయితే, లేదా ఇతర ఎవరైనా వేధింపులకు గురి అయినట్లు తెలిస్తే, గమనిస్తే పోలీసులకు నేరుగా సంప్రదించాలని, ఆసిఫాబాద్ షీ టీమ్ నెంబర్ 8712670564, లేదా డయల్ 100 కు సమాచారం అందించాలని సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ రామదాస్,సిబ్బంది పాల్గొన్నారు.