

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరులో వెలసి ఉన్న శ్రీ సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ సౌమ్య స్వామి కళ్యాణం సందర్భంగా ఉదయం శ్రీ సౌమ్యనాథ స్వామికి పట్టు వస్త్రాలను టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు రాజంపేట టిడిపి నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి పట్టు వస్త్రాలను సౌమ్యనాథ స్వామి కి సమర్పించారు తరువాత టిటిడి వారు దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో లేబాక గ్రామ సర్పంచ్ లంకయ్యగారి నరసయ్య, నందలూరు మాజీ ఎంపీపీ భువన బోయిన లక్ష్మీనరసయ్య,ఎంపిటిసి పెంచలయ్య,సర్పంచ్ చుక్క యానాది, మరియు నియోజ కవర్గ స్థాయి ముఖ్య నాయకులు నాగిరెడ్డిపల్లి మేజర్ సర్పంచ్ జంబు సూర్యనారాయణ,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యెద్దల విజయ సాగర్ పాల్గొనడం జరిగింది టిడిపి నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనడo జరిగింది.