

జనం న్యూస్ జూలై 10:నిజామాబాద్ జిల్లాఏర్గట్లమండలము
: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఏర్గట్లమండల కేంద్రం లోని రైతు వేదిక భవనంలో కొనసాగిన బూత్ స్థాయి అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని నిజామాబాద్ అసిస్టెంట్ కలెక్టర్,బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి అంకిత్ గురువారం రోజునా పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన శిక్షణ గురించి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యమునకు ఎన్నికలు పెద్ద పండుగ లాంటివని, ఎన్నికలు నిర్వహించుటకు బూతు స్థాయి ఓటర్ లిస్టు అత్యంత కీలకమైందని అన్నారు. అంత కీలకమయిన ఓటర్ లిస్టు తయారు చేయు భాద్యత బిఎల్ వో లకు ఉంటుందని అన్నారు. కాబట్టి బి ఎల్ వో లు ఈ శిక్షణలో మాస్టర్ ట్రై నర్లు చెప్పు విషయాలు అన్ని శ్రద్ధతో విని, తప్పులు లేని ఓటర్ లిస్ట్ ను తయారు చేయలని సూచించారు. మరణించిన ఏ ఒక్క వ్యక్తి కూడా ఓటర్ లిస్ట్లో ఉండకూడదని, మరణించిన వారి పేర్లను తొలగించాలని,పద్దేనిమిది సంవత్సరాల నిండిన ప్రతి, యువతీ, యువకులకు కొత్తగా ఓటు హక్కు కోసం పేర్లు నమోదు చేయాలని, పేర్లు, ఇంటి పేర్లు, ఇంటి నెంబర్ లు సవరణలు ఉంటె వాటిని సరి చేయాలని, సూచించినారు. తప్పులు లేని ఓటర్ లిస్ట్ ను కూడా తయారు చేయాలనీ సూచించారు. ఈ కార్యక్రమములో తహసీల్దార్ మల్లయ్య, మాస్టర్ ట్రై నర్లు జి. రవి, జే. ప్రవీణ్, సీనియర్ అసిస్టెంట్ కిరణ్, మండల రెవిన్యూ పరిశీలకులు సదానందం, రవిదాస్, కంప్యూటర్ ఆపరేటర్ రాకేశ్, తదితరులుపాల్గొన్నారు.