Listen to this article

జనం న్యూస్ 14 జులై, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

ఉత్తరాంధ్ర పురోహిత మిత్ర సంఘ వ్యవస్థాపకులు ఏలూరు వెంకట రమణమూర్తి (రాజేష్ శర్మ)కు తెలంగాణ మదర్ తెరిసా అసోసియేషన్ ఉత్తమ సోషల్ వర్కర్ అవార్డును ప్రధానం చేసింది. హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు ఆడిటోరియం లో జరిగిన ఓ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రముఖులు ఆదివారం వెంకటరమణమూర్తి శర్మతో పాటు అతని కుటుంబ సభ్యులకు ఉత్తమ సోషల్ వర్కర్ అవార్డుతో పాటు ఆయనకు ప్రత్యేకంగా గురు ముఖంగా పురోహిత అర్చక బ్రహ్మ మెడల్ తో సత్కరించి విరాట బ్రహ్మ పురస్కారాన్ని, అవార్డును అందజేసారు. ఈ మేరకు రాజేష్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. తనకు ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు రావడానికి అన్ని విధాల ప్రోత్సహించిన మిత్రులు, కుటుంబ సభ్యులు, బంధు వర్గానికి ఆయన ధన్యవాదాలు తెలియ జేశారు. ఉత్తరాంధ్రలో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ప్రముఖంగా వ్యవహస్తున్న సహచరులకు ఈ అవార్డును అంకితం చేస్తున్నట్లు రాజేష్ శర్మ వెల్లడించారు.