

జనం న్యూస్ జూలై 17(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-
పోలీసు ప్రజా భరోసా కార్యక్రమంలో భాగంగా బుధవారం మునగాల మండల కేంద్రంలోని స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో,మునగాల పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మీకు బరోసా కల్పించడానికి వచ్చాం అంటూ బాలికలకు సామాజిక అంశాలు,చదువుల ప్రాముఖ్యత,విద్యార్థులపై సోషల్ మీడియా ప్రభావం, ఆకర్షణల,బాలికలకు దృడ సంకల్పం,మానసిక దైర్యం, వేధింపులపై పిర్యాదు చేయడం,సమస్యలను ఉపాధ్యాయులకు తెలియజేయడం అంశాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. బాలికలు మానసిక సంకల్పము, మానసిక దృఢత్వం,మానసిక ధైర్యము కలిగి ఎలాంటి సందర్భాలనైనా ఎదుర్కొని నిలబడాలి అన్నారు.ఎవరైనా వ్యక్తులు బాలికలను, విద్యార్థులను తాకుతున్నట్లయితే అది ప్రేమగా తాకుతున్నారా,చెడు ఉద్దేశ్యంతో తాకుతున్నారా, శరీరభాగాలు వత్తిడికి గురి చేస్తున్నారా అనేది బాలికలు, విద్యార్థినిలు గుర్తించాలి, ఇలాంటి సందర్భాలలో ఎలాంటి భయాందోళనకు గురి అవ్వకుండా మన తల్లిదండ్రులకు గాని మన ఉపాధ్యాయులకు గాని విషయాన్ని తెలియచేయాలి. అసాధారణ పరిస్థితుల్లో బాలికలకు, మహిళలకు వ్యక్తిగత మానసిక ధైర్యం చాలా విలువైనవి అన్నారు. వేధింపులపై ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని డయల్ 100,కు పిర్యాదు చేయాలని డీఎస్పీ కోరారు.బాలికల మహిళల రక్షణలో శాఖ నిరంతరంగా పని చేస్తుందని అన్నారు.నేటి యువత మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలని సూచించారు.చదువును కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని విద్యార్థులకు అవగాహన కల్పించారు.

