ప్రీ ప్రైమరీ స్కూల్స్ ప్రారంభించిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
జనం న్యూస్ జూన్ 30 చిలిపి చెడు మండల ప్రతినిధిమెదక్ జిల్లాచిలిపిచెడ్ మండలంలో ఫైజాబాద్,గంగారం, చండూర్. గౌతాపూర్ గ్రామాలలో ఫ్రీ ప్రైమరీ స్కూల్స్ (పూర్వ ప్రాథమిక పాఠశాలలు) నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీతలక్ష్మారెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి రిబ్బన్ కటింగ్ తో ప్రారంభించారు. ఫైజాబాద్ గ్రామంలో నూతనంగా వేసిన సిసి రోడ్లు ప్రారంభించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ స్కూల్స్ కు ఇన్స్పెక్టర్లను ఆయాలను సంబంధించిన రూములు ప్రభుత్వం కేటాయించలని తెలియజేశారు. చిలిపిచెడ్ మండలంనికి తాసిల్దార్, ఎంపిడిఓ, కార్యాలయాలు కావాలని ఇంచార్జ్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్తే ఎమ్మార్వో కార్యాలయానికి రెండు కోట్ల 26 లక్షలు సాంక్షన్ వచ్చాయి. సీఎం ఆర్ ఎఫ్ కింద మండలానికి సంబంధించి 20 మందికి 5,29,000 చెక్కుల అందజేశారు. సిసి రోడ్లకు మండలానికి ఎస్సీ కాలనీలకు సంబంధించి, ఉపాధి హామీ పథకం కింద గౌతాపూర్ 3 తోప్య తండాకు రెండున్నర లక్షలు,చిలిపిచెడ్ కు3 లక్షలు జగ్గంపేట్ 3 లక్షలు సోమల తండాకు రెండున్నర లక్షలు ఫైజాబాద్ కు 3 లక్షలు మొత్తం 17 లక్షల సిసి రోడ్లు సాంక్షన్ ఇవ్వడం జరిగింది. మండలంలో మహిళా సమైక్యకు 10 లక్షలు, స్కూల్ కాంపౌండ్ కు 10 లక్షలు. అసంపూర్తిగా మిగిలిపోయిన కాంపౌండ్ వాల్ 10 లక్షలు. ఫర్టిలైజర్ యాప్ ను తొలగించి దుకాణంలో యూరియాను అందుబాటులో ఉంచాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరెంటు కోతలు అధికంగా జరుగుతున్నాయని ప్రభుత్వం 24 గంటలు రైతులకు నాణ్యమైన కరెంటు అందించాలని డిమాండ్ చేశారు. ప్రతి రైతుకి రైతుబంధు కింద 15 వేల రూపాయలు ప్రతి ఎకరాకు వేయాలని డిమాండ్ చేశారు. ప్రతి రైతుకి సన్న వడ్లకి బోనస్ 500 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధికారు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు