

జనవరి 26 జనం న్యూస్ 76వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా దుర్గి మండలంలోని ప్రభుత్వ, ప్రవేట్,కార్యాలయాలలో వివిధ పాఠశాలల్లో ఆదివారం త్రివర్ణ జెండా రెప రెప లాడింది.తహసీల్దార్ కార్యా లయంలో తహసీల్దార్ ఫణింద్ర కుమార్, యం పి డి ఓ కార్యాలయంలో యం పి డి ఓ శివప్రసాద్, స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై సుధీర్ కుమార్ ప్రవేట్ కార్యాలయాల్లో సంభందిత అధి కారులు పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు జెండాను ఎగురవేసి గౌరవవందనం పొందారు. ఈ సందర్బంగా పలువురు అధికారులు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగఫలమే మనకుస్వాతంత్య్రం వచ్చిందన్నారు. డా. బి ఆర్.అంబెడ్కర్ భారతీయులు ఎట్లా స్వపరిపాలన చేసుకోవాలో రాజ్యాంగంను రూపొందించి భారతరాజ్యాంగనిర్మాతగా పేర్గంచారన్నారు 26జనవరి 1950నుండి ఈ రాజ్యాంగంను అమలు చేయాలని ఆమోదం పొందిన రోజునే గణతంత్రదినోత్సవం (రిపబ్లిక్ డే )అంటారన్నారు. ఇప్పటికి 76వ రిపబ్లిక్ డే గా మన పాలకులు జరుపుకోవడంమన అదృష్టంమన్నారు. ఈ కార్యక్రమంలో యంపి పి సునీత సాయి శంకర్ జడ్పిటిసి శె ట్టిపల్లి యలమంద, యం పి టి సికటకంగోపాల్ఎ.పిఓ.వెంకటేశ్వర్లు వివిధ కార్యాలయాల సిబ్బంది,ఉపాధ్యాయులు విద్యార్థులు,స్టేషన్ పోలీసులు పాల్గొన్నారు