

(జనం న్యూస్ 30 జూలై భీమారం మండల ప్రతినిధి కాజీపేట రవి )
భీమారం మండల కేంద్రంలోని బుధవారం రోజున ఆదివాసి నాయక పోడు సంఘం కుల సంఘం ఎన్నికలు బుధవారం రోజున జిల్లా ఉపాధ్యక్షులు తైనేని రవి నేతృత్వంలో నిర్వహించారు. భీమారం మండల అధ్యక్షునిగా రొడ్డ శ్రీనివాస్ ఉపాధ్యక్షుడిగా బూనేని రాజన్న, జాయింట్ సెక్రెటరీగా భూనేని సుధాకర్, జనరల్ సెక్రెటరీగా పూజారి కృష్ణమూర్తి కోశాధికారిగా మంచాల కృష్ణమూర్తి, గౌరవ అధ్యక్షులుగా మన బోతుల వెంకటేశ్వర్లు సలహాదారులుగా తోట శ్రీరాములు ను కుల సంఘం నాయకులు జిల్లా సంఘం నాయకుల మధ్యలో ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా భీమారం మండల నూతన అధ్యక్షుడు రొడ్డ శ్రీనివాస్ మాట్లాడుతూ అనేక రకాలుగా వెనుకబడినటువంటి మా ఆదివాసి నాయకపాడు కుల సంఘాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయుటకు తనవంతుగా అహర్నిశలు కృషి చేస్తారని కుల సంఘం నాయకులకు కులానికి ఏ సమస్య వచ్చినా నేను ముందుంటా అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆదివాసి నాయకపోడు కుల సంఘం సభ్యులు మహిళలు యువకులు పాల్గొన్నారు.