

బిచ్కుంద ఆగస్టు 12 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలంలోని రాజుల్లా గ్రామంలో లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి చెక్కులను నూతన రేషన్ కార్డు జుక్కల్ శాసనసభ్యులు తోడు లక్ష్మీకాంతరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది సంవత్సరాలలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేని రేషన్ కార్డులను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు కవిత, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కొంగల శంకర్, పార్టీ అధ్యక్షులు గంగాధర్, తాహసిల్దార్ వేణుగోపాల్, ఎంపీడీవో గోపాలకృష్ణ, డిప్యూటీ తహసిల్దార్ భరత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

