

జనం న్యూస్ 27జనవరి, పెగడపల్లి ప్రతినిధి, మల్లేశం. జగిత్యాల జిల్లాలోని పెగడపల్లి మండలం కేంద్రంలోని మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు పెగడపల్లి మండలం ఆరవెల్లి గ్రామం & సుద్దపెల్లి గ్రామాలలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో గ్రామ కమిటీల ఎన్నికలు జరిగాయి.. రేపు జరగబోయే మహోత్తర కార్యక్రమానికి ప్రతి కార్యకర్త కుల బాంధవులు సైనికుల్లాగా ఒక ఐక్యతతో ఉండి రేపు జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి కొత్తూరి బాబు, నక్క గంగాధర్, నలువాల లక్ష్మణ్, సుంకే రాజయ్య తదితరులు పాల్గొన్నారు. కొత్తగా ఎన్నికైన సభ్యులను మండల నాయకులు, అలాగే వివిధ పార్టీలకు వివిధ సంఘాలకు చెందిన నాయకులు అభినందించారు.. ఎన్నికైన సుద్దపెల్లి గ్రామ కమిటీ సభ్యులు అధ్యక్షులు. నలువాల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి నలువాల తిరుపతిచిర్రపోచయ్య,ఉపాధ్యక్షులు నలువాల పెద్ద నర్సయ్య అధికార ప్రతినిధి నలువాల అంజయ్య ఎన్నికైన అరవెల్లి గ్రామ కమిటీ సభ్యులు.అధ్యక్షులుకొత్తూరి రాజు ప్రధాన కార్యదర్శిఆరెల్లి అనిల్. ఉపాధ్యక్షులుఆరెల్లి మహేష్ అధికార ప్రతినిధిఆరెల్లి హన్మాండ్లు వివిధ పార్టీలకు మరియు వివిధ సంఘాలకు చెందిన నాయకులందరూ పాల్గొన్నారు.