Listen to this article

జనంన్యూస్. జనవరి. 27. నిజామాబాదు. ప్రతీనిది.నిజాంబాద్ జిల్లా సిరికొండ మండలంలోని వివిధ పలు అభివృద్ధి పనులకు గాను. 14.38 కోట్ల రూపాయలు మంజూరైనట్లు కాంగ్రెస్ పార్టీ సిరికొండ మండల అధ్యక్షుడు బాకారం రవి తెలిపారు సోమవారం స్థానిక మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలతో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి అభివృద్ధి పనులకు మంజూరైన నిధులు ఏ గ్రామానికి ఎంత అనేది ఆయన వివరించారు.
ఇన్ని నిధులు మంజూరు చేయించిన స్థానిక రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి సిరికొండ ప్రజల తరఫున పార్టీ కార్యకర్తల తరఫున ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.