జనం న్యూస్. ఆగస్టు 19. సంగారెడ్డి జిల్లా. హత్నూర.
మండల కేంద్రమైన హత్నూర గ్రామంలోని కట్టు కాలువలో విపరీతంగా పిచ్చి మొక్కలు పెరిగి చెత్తాచెదారంతో పేరుకుపోయి చాకి చెరువులోకి వర్షపునీళ్లు వెళ్లకుండా అంతరాయం ఏర్పడింది.అదిగమనించిన హత్నూర గ్రామస్తులు తక్షణమే సహాయక చర్యలు చేపట్టే పనిలో నిమగ్నమయ్యారు.చాకి చెరువులోకి వెళ్లాల్సిన వర్షపు నీళ్లు కట్టుకాలువలో పెద్ద ఎత్తున పేరుకుపోయిన పిచ్చి మొక్కలతోఅడ్డంకులుఏర్పడి నేరుగా పొలాల్లోకి వర్షపు నీళ్లు చేరుతున్నాయని అన్నారు.వర్షపు నీటి ప్రభావంతో పొలంమడికట్లు తెగి పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు గ్రామస్తులు యువకులు కలిసి జెసిపి సహాయంతో కట్టు కాలువలో పేరుకుపోయిన పిచ్చి మొక్కలనుతొలగించారు. అంతలోనే అటువైపు వెళ్తూ గమనించిన హత్నూర తహసిల్దార్ పర్వీన్ షేక్. సంతోషం వ్యక్తంచేశారు. గ్రామస్తులను రైతులను అభినందించారు.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అన్ని విధాల ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మంజీరా నది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల హత్నూర మండలంలోని ఏ గ్రామంలోనైనా.ప్రజలకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగిన తాసిల్దార్ కార్యాలయానికి పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించాలని సూచించారు.సమాచారం అందిన వెంటనే గ్రామపంచాయతీ కార్యదర్శులు పోలీసులు అధికారులు తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.ఈకార్యక్రమంలో. గ్రామపంచాయతీ కార్యదర్శి మహేష్.పారిశుద్ధ్యకార్మికులు. గ్రామస్తులు.చెక్కరవీందర్ గౌడ్.పండుగశేఖర్.పొట్ల చెరువునరేందర్.వల్లిగారి దుర్గేష్.పొట్లగళ్ళపెంటయ్య. నల్లోల్లఎల్లయ్య.నల్లోల్ల నాగేష్. బోరుపట్లకిష్టయ్య.కొత్తకుంట శంకర్.జనార్ధ.గ్రామస్తులు రైతులుయువకులు తదితరులుసహాయక చర్యల్లో పాల్గొన్నారు.



