

జనం న్యూస్ ఆగస్టు 28 నడిగూడెం
త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం నడిగూడెం మండలం శ్రీరంగాపురం గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాను గురువారం ప్రచురించారు. ఈ ఓటర్ల జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30వ తేదీ లోపు కార్యాలయంలో సంప్రదించాలని పంచాయతీ కార్యదర్శి ప్రత్యూష తెలిపారు.