

జనం న్యూస్ //జనవరి 29//జమ్మికుంట // కుమార్ యాదవ్..
గ్రామ నవ నిర్మాణ సమితి ” జి ఎన్ ఎన్ ఎస్ కేవీకే ” ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్టులో భాగంగా “మన ఇంటి మందం మన పంట”(ప్రకృతి వ్యవసాయం) అనే సంకల్పంతో రసాయన ఎరువులు వాడకుండా ప్రకృతి లో లభించే సహజ వనరులతో వ్యవసాయం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో మన ఆరోగ్యాలను మనమే కాపాడుకోవాలని మన ముందు తరాలకు ఆదర్శంగా నిలవాలని దీని ముఖ్య ఉద్దేశం.ప్రకృతి వ్యవసాయం చేయడం వలన ప్రకృతి లో కాలుష్యం నివారించవచ్చు ఇందులో భాగంగా మంగళవారం జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామంలో తాటికంటి అంకయ్య , వారి యొక్క పొలం వద్దా రైతులు ముందుకు వచ్చి ప్రకృతి వ్యవసాయంలో భాగమైనారు. దీనిలో భాగంగా 20 గుంటలు వ్యవసాయ భూమికి 100లీటర్ల జీవామృతం (ఆవు పేడ, ఆవు మూత్రం, బెల్లం, పప్పుల పిండి ,రసాయనాలు కలపని మట్టి లేదా పుట్ట మట్టి ) తయారు చేయడం జరిగింది. జీవామృతం పారించడం వల్ల భూమిలో ఉన్న మేలుచేసే సూక్మజీవుల సంఖ్య పెరిగి భూసారం పెరుగుతుంది.తద్వారా ఆరోగ్య కరమైన మరియు నాణ్యమైన పంట వస్తుంది. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ జమ్మికుంట క్లస్టర్ కో ఆర్డినేటర్ దేవునూరి రవీందర్ ,ఫీల్డ్ ఫెసిలెటర్ నమ్రత, తాటికంటి శ్రీనివాస్, రమాదేవి, గిరవేన అభిషేక్ యాదవ్, ఎడ్ల రమేష్ . గ్రామ రైతులు కట్కూరి కోమల్ రెడ్డి, మరియు ఐలయ్య యాదవ్ తదితర రైతులు పాల్గొన్నారు.